కైలాసంలో దాగుడుమూతలు ఆడదామని అనుకున్నారు. కుమారుడు తానే కళ్ళకు గంతలు కట్టుకుని మిగిలినవారిని పట్టుకుంటానన్నాడు.. కళ్ళకు గంతలు కట్టి వెతుకుతూ నవ్వుతూ తిరిగేసి త్వరగానే అన్నను, తండ్రిని పట్టేసుకున్నాడు.. కానీ అమ్మ మాత్రం అందలేదు. గంతలు విప్పి వెతికినా కనిపించలేదు. అమ్మ కనిపించలేదని ఏడ్చాడు. వినాయకుడు నవ్వుతూ తండ్రిని చూశాడు. అప్పుడు తనలో అర్ధభాగంగా మారి, బయటకు కనిపించకుండా దాక్కున అర్ధాంగిని పరమేశ్వరుడు ప్రకటం కమ్మని కోరాడు. ఆ తల్లి నవ్వుతూ వ్యక్తమై పిల్లవాడిని కన్నీరు తుడిచి లాలించింది.
అట్టి తల్లి మనలను అందరిని సర్వదా రక్షించుగాక.
అట్టి తల్లి మనలను అందరిని సర్వదా రక్షించుగాక.
No comments:
Post a Comment